కరోనా కట్టడికి తక్షణ చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2021-04-17T09:47:13+05:30 IST
రెండో దశలో కరోనా విస్తృతంగా, వేగంగా వ్యాపిస్తున్నందున తెలుగు రాష్ట్రాలు దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా భావించి తగిన చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక తరపున ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.సుధ, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్ కృష్ణ శుక్రవారం లేఖ రాశారు.
తెలుగు రాష్ట్రాలకు మానవ హక్కుల వేదిక లేఖ
విశాఖపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రెండో దశలో కరోనా విస్తృతంగా, వేగంగా వ్యాపిస్తున్నందున తెలుగు రాష్ట్రాలు దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా భావించి తగిన చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక తరపున ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.సుధ, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్ కృష్ణ శుక్రవారం లేఖ రాశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో పరిస్థితి దారుణంగా ఉందని.. మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వకూడదని వారు సూచించారు.