రేషన్‌ సరుకుల పంపిణీ పటిష్టంగా చేపట్టండి

ABN , First Publish Date - 2020-03-29T11:21:58+05:30 IST

ఈనెల 29 నుంచి ప్రజలకు రేషన్‌ సరుకుల పంపిణీ పటిష్టంగా చేపట్టాలని అధికారులను మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

రేషన్‌ సరుకుల పంపిణీ పటిష్టంగా చేపట్టండి

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌


నెల్లూరు(జడ్పీ), మార్చి 28 : ఈనెల 29 నుంచి ప్రజలకు రేషన్‌ సరుకుల పంపిణీ పటిష్టంగా చేపట్టాలని అధికారులను మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆదేశించారు. ఆయన చాంబర్‌లో అధికారులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. రేషన్‌ సరుకుల సరఫరాకు ఇబ్బంది లేకుండా వాహనాలకు బ్యానర్లు కట్టాలన్నారు.  ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలన్నారు. రోజుకు వంద మందికి మాత్రమే సరుకులు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించి కార్డుదారులకు తెలన్నారు. ఈ సమావేశంలో జేసీ వినోద్‌కుమార్‌, రూరల్‌ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T11:21:58+05:30 IST