పొగాకులో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-29T05:41:43+05:30 IST

తుపాను వల్ల నీట మునిగిన పొగాకు నారు మళ్లు, సాగులో ఉన్న తోటల్లో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని రీజనల్‌ మే నేజర్‌ ఆర్‌.శ్రీనివాసులునాయుడు తెలిపారు.

పొగాకులో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి


ఆర్‌ఎం


మద్దిపాడు, నవంబరు 28 : తుపాను వల్ల నీట మునిగిన పొగాకు నారు మళ్లు, సాగులో ఉన్న తోటల్లో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని రీజనల్‌ మే నేజర్‌ ఆర్‌.శ్రీనివాసులునాయుడు తెలిపారు. శనివారం మండలంలోని గు రవారెడ్డిపాలెం, నేలటూరు గ్రామాల్లోని పొగాకు తోటలను ఆయన పరిశీలిం చారు. నారుమడులు బెట్టకు రాకుండా ఆమోనియా సల్ఫేట్‌, పొటాషియం సల్పేట్‌ వేయాలని, బూజుతెగులు ఉంటే బైటాక్స్‌ 20గ్రాములు 10లీటర్ల నీటిలో పిచికారి చేయాలన్నారు. నల్లనేలల రీజనల్‌మేనేజర్‌ డి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ భూమిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఆకుమచ్చతెగులు, నల్లకాడ తెగులు వస్తుందని, వాటి నివారణకు క్రాప్రిమేటిక్‌ 20గ్రాములు 20లీటర్ల నీటిలో పిచికారి చేయాలన్నారు. 


Updated Date - 2020-11-29T05:41:43+05:30 IST