హెల్ప్‌ డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-07T04:31:11+05:30 IST

జిల్లా ఆస్పత్రికి వచ్చే ప్రజలు అక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు.

హెల్ప్‌ డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఇన్‌చార్జి ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 6: జిల్లా ఆస్పత్రికి వచ్చే ప్రజలు అక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రి ఆవరణలో హెల్ప్‌డెస్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్ప్‌డెస్క్‌లో ఉండే పోలీసులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఆస్పత్రికి వచ్చే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు, సీఐ అశోక్‌, ఆర్‌ఐ శేఖర్‌బాబు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ రాణాప్రతాప్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T04:31:11+05:30 IST