ఆర్‌బీకేలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-25T06:19:38+05:30 IST

రైతుభరోసా కేంద్రాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి కోరారు.

ఆర్‌బీకేలను సద్వినియోగం చేసుకోవాలి
సుండ్రుపుట్టులో ఆర్‌బీకేను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి


 ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి 

పాడేరురూరల్‌, మే 24: రైతుభరోసా కేంద్రాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి కోరారు. మంగళవారం మండలంలోని సుండ్రుపుట్టు, తుంపాడల్లోని రైతుభరోసా కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పఽథకాలను రైతులు, గిరిజన ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నకుమారి, వైస్‌ఎంపీపీ కనకాలమ్మ, వ్యవసాయసలహామండలి చైర్‌పర్సన్‌ మినుముల సరస్వతి, ఎంపీటీసీ సభ్యులు గిడ్డి విజయలక్ష్మి, నరసింహమూర్తి, సర్పంచ్‌ గబ్బాడ చిట్టిబాబు, మినుముల కన్నాపాత్రుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T06:19:38+05:30 IST