మంత్రులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-04-11T04:02:00+05:30 IST
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావ్ డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి దేవినేని
నెల్లూరు (వైద్యం)ఏప్రిల్ 10 : అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావ్ డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రులు వలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటేయించాలని చెబుతున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెజర్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.