డబ్బు వసూలుచేసే విద్యాసంస్థలపై చర్యలు చేపట్టండి

ABN , First Publish Date - 2020-07-04T11:12:45+05:30 IST

ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై సత్వరమే చర్యలు చేపట్టాలని ఏబీవీపీ

డబ్బు వసూలుచేసే విద్యాసంస్థలపై చర్యలు చేపట్టండి

తిరుపతి(విద్య): ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై సత్వరమే చర్యలు చేపట్టాలని ఏబీవీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆర్‌ఐవో కార్యాలయం వద్ద శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. నేతలు హరికృష్ణ, నాదముని, నగేశ్‌, భాస్కర్‌, సాయికుమార్‌, రాధిక తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T11:12:45+05:30 IST