వలంటీర్లపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-03-01T05:09:34+05:30 IST
వైసీపీ నాయకులు పలు వార్డుల్లో వలంటీర్లతో ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష సహాయ ఎన్ని కల అధికారి, మునిసిపల్ కమిషనర్ డి.రాజగోపాలరావుకు ఆదివారం ఫి ర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తున్న వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పలాస: వైసీపీ నాయకులు పలు వార్డుల్లో వలంటీర్లతో ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష సహాయ ఎన్ని కల అధికారి, మునిసిపల్ కమిషనర్ డి.రాజగోపాలరావుకు ఆదివారం ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తున్న వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వలం టీర్లకు సంబంధించిన వీడియోలను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. కాగా లిఖితపూర్వకంగా తమకు ఫిర్యాదు చేస్తే అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీఇచ్చారు. తాము పట్టు కున్న వలంటీర్లను ప్రశ్నిస్తుంటే విధులకు రాజీనామా చేశామని చెబుతున్నారని, వాస్తవానికి వారంతా వైసీపీ సేవలో తరిస్తున్నారని శిరీష ఆరోపిం చారు. ఆమె వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.