6 నెలల తర్వాత ‘తాజ్’ ప్రారంభం నేడే!
ABN , First Publish Date - 2020-09-21T08:39:13+05:30 IST
ప్రఖ్యాత పర్యాటక కేంద్రం, ప్రేమ మందిరం తాజ్మహల్.. మళ్లీ తన సొబగులతో వీక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు ముస్తాబవుతోంది. కరోనా కారణంగా ఆరు నెలల పాటు మూత పడ్డ ఈ పాలరాతి అద్భుతం.. మళ్లీ కనువిందు చేయనుంది...
- షిఫ్టుకు 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం, ప్రేమ మందిరం తాజ్మహల్.. మళ్లీ తన సొబగులతో వీక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు ముస్తాబవుతోంది. కరోనా కారణంగా ఆరు నెలల పాటు మూత పడ్డ ఈ పాలరాతి అద్భుతం.. మళ్లీ కనువిందు చేయనుంది. తాజ్మహల్ వీక్షణకు సోమవారం నుంచి సందర్శకులను అనుమతించనున్నట్టు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎ్సఐ) ప్రకటించింది. అలాగే, ఆగ్రా కోట సందర్శనకు కూడా పర్యాటకులను అనుమతిస్తామని తెలిపింది. తాజ్మహల్లోకి ఒక్క షిఫ్టుకి 2,500 మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తామని, టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.