తహసీల్దార్పై విచారణ
ABN , First Publish Date - 2021-10-20T03:00:19+05:30 IST
వెంకటగిరిలో పలు విలువైన ప్రభుత్వ స్థలాలను, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారంటూ తహసీల్దార్ ఆదిశేషయ్యపై శ్రీ
వెంకటగిరి, అక్టోబరు 19 : వెంకటగిరిలో పలు విలువైన ప్రభుత్వ స్థలాలను, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారంటూ తహసీల్దార్ ఆదిశేషయ్యపై శ్రీకృష్ణదేవరాయ కాపుబలిజ సేవాసంఘం అధ్యక్షుడు తోట కృష్ణయ్య చేసిన ఫిర్యాదుపై మంగళవారం స్పెషల్ కలెక్టరు ఎస్వీ నాగేశ్వరరావు మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టామన్నారు. వీటిపై నివేదిక సిద్దంచేసి జిల్లా కలెక్టరుకు అందజేస్తామన్నారు.
న్యాయం జరగకుంటే హైకోర్టును ఆశ్రయిస్తా..
తహసీల్దార్ ఆదిశేషయ్యపై తాను అధికారులకు ఫిర్యాదుచేస్తే ఇప్పటికే రెండు దఫాలు విచారణ పూర్తిచేసి, మూడో దఫా విచారణ చేసినా కూడా చర్యలు తీసుకోలే దని శ్రీకృష్ణదేవరాయ కాపుబలిజ సేవాసంఘం అధ్యక్షుడు తోట కృష్ణయ్య ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టంచేశారు.