హైదరాబాద్‌కు తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్లు

ABN , First Publish Date - 2021-03-14T23:59:32+05:30 IST

వైసీపీ బెదిరింపులను ఎదుర్కొని గెలిచిన తాడిపత్రి మున్సిపాలిటీలోని

హైదరాబాద్‌కు తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్లు

అనంతపురం: వైసీపీ బెదిరింపులను ఎదుర్కొని గెలిచిన తాడిపత్రి మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు  జేసీ ప్రభాకర్ రెడ్డి, పవన్ రెడ్డిలు రహస్య ప్రదేశానికి తరలించారు. జిల్లాలో తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. దీంతో తమ అభ్యర్థులను వైసీపీ నాయకులు ప్రలోభ పెడతారని భావించి వారిని ఎవరికీ తెలియని ప్రదేశానికి జేసీ సోదరులు తరలించారు. టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నాయకులు బెదిరించి భయపెడతారని,  భయభ్రాంతులకు గురి చేస్తారనే ఉద్దేశంతో వారిని రహస్య ప్రదేశాలకు  జేసీ సోదరులు తరలించారు. టీడీపీ కౌన్సిలర్లను  తీసుకుని  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు.


తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 36 ఉన్నాయి. టీడీపీ 18 వార్డులలో విజయం సాధించింది.  వైసీపీ 16 స్థానాలలో గెలుపొందింది.  సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందారు.

Updated Date - 2021-03-14T23:59:32+05:30 IST