తహసీల్దార్‌పై మండిపడ్డ తాడిపత్రి ఎమ్మెల్యే!

ABN , First Publish Date - 2021-06-25T06:48:21+05:30 IST

కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ఈ-పాస్‌ పుస్తకం మంజూరు, ఆనలైనలో భూ వివరాల నమోదులో తీవ్రజాప్యంపై గురువారం స్థానిక తహసీల్దార్‌ విజయకుమారిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫోనలో మండిపడ్డారని తెలిసింది.

తహసీల్దార్‌పై మండిపడ్డ తాడిపత్రి ఎమ్మెల్యే!
తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఫోనలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి

పుట్లూరు, జూన 24: కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ఈ-పాస్‌ పుస్తకం మంజూరు, ఆనలైనలో భూ వివరాల నమోదులో తీవ్రజాప్యంపై గురువారం స్థానిక తహసీల్దార్‌ విజయకుమారిపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫోనలో మండిపడ్డారని తెలిసింది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన తహసీల్దార్‌ లేకపోవడంతో సిబ్బందితో ఆరాతీశారు. ఆమె విధులకు హాజరుకాకపోవడంతో ఫోనలో మాట్లాడారు. ఈ సందర్భంగా నెలరోజులుగా భూములను ఆనలైన చేయడంలో ఎందుకు జాప్యం చేశారంటూ ప్రశ్నించారు. వెంటనే వివరాలను ఆనలైనలో నమోదు చేయకుంటే అనుచరులతో కలిసి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. 

Updated Date - 2021-06-25T06:48:21+05:30 IST