Tadipatriలో ఉద్రిక్తతకు దారితీసిన డ్రైనేజీ వివాదం

ABN , First Publish Date - 2022-06-11T16:42:18+05:30 IST

తాడిపత్రిలో డ్రైనేజీ కాలువ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.

Tadipatriలో ఉద్రిక్తతకు దారితీసిన డ్రైనేజీ వివాదం

అనంతపురం: తాడిపత్రిలో డ్రైనేజీ కాలువ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నంద్యాల రోడ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ మరమ్మత్తు పనులను టీడీపీ(TDP) చేపట్టింది. గత రెండు రోజుల నుంచి పూడికతీత పనులు జరుగుతున్నాయి. అయితే రిపేరి తాము చేస్తామంటూ వైసీపీ (YCP) నాయకులు పోటీగా జేసీబీలు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య పోటాపోటీతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మల్లిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు దాడి చేశారు. వెంటనే ఆమెను తాడిపత్రి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో టీడీపీ కౌన్సిలర్‌ను కుటుంబ సభ్యులు అనంతపురంకు తరలించారు. 

Updated Date - 2022-06-11T16:42:18+05:30 IST