రక్షణ వలయంలో సీఎం నివాస ప్రాంతం
ABN , First Publish Date - 2021-06-20T05:17:00+05:30 IST
రాజధాని రైతుల ఉద్యమం 550వ రోజుకు చేరడంతో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమై భారీ బలగాలతో ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాడేపల్లి టౌన్, జూన్19: రాజధాని రైతుల ఉద్యమం 550వ రోజుకు చేరడంతో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమై భారీ బలగాలతో ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం పోలీసులు తాడేపల్లి ప్రాంతంలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. సీఎం నివాస పరిసర ప్రాంతంలో ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే అన్ని రహదారుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతివాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు నిర్వహించినట్టు నార్త్ జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు.