కలెక్టర్లు, ఎస్పీలతో CM Jagan ' స్పందన' Video Conference
ABN , First Publish Date - 2022-06-01T19:30:23+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ (Jagan) కలెక్టర్లు, ఎస్పీలతో 'స్పందన' కార్యక్రమంలో పాల్గొన్నారు.
Amaravathi: ముఖ్యమంత్రి జగన్ (Jagan) కలెక్టర్లు, ఎస్పీలతో 'స్పందన' కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఖరీఫ్ సన్నద్దత, విత్తనాలు, ఎరువుల పంపిణి, గృహ నిర్మాణం, అమ్మఒడి ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలపై జగన్మోహన్ రెడ్డి ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.