అత్యాచారం కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

ABN , First Publish Date - 2021-06-23T15:25:24+05:30 IST

తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

అత్యాచారం కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

గుంటూరు జిల్లా: తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఇద్దరు నిందితులు తాడేపల్లి, చినగంజామ్ వాసులుగా నిర్ధారించారు. అత్యాచారం తర్వాత రైల్వే బ్రిడ్జి దగ్గర నిందితులు మకాం వేసినట్లు సమాచారం.  అత్యాచారం తర్వాత తాపీ మేస్త్రికి ఫోన్‌కు విక్రయించారు. తాపీ మేస్త్రి భార్య ఫోన్ ఆన్ చేయడంతో వెంటనే పోలీసులు గుర్తించారు. ఆమెను ప్రశ్నించడంతో అసలు విషయం బహిర్గతమైంది. నిందితులపై తాడేపల్లి, బందరు రైల్వే పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. కృష్ణానది ప్రాంతంలో రైలు ప్రయాణీకులపై దౌర్జన్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దోచుకున్న సొత్తుతో మద్యం, గంజాయి కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రౌడీ షీటర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించగా.. వారే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వారి ఫోటోలను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు గుర్తుపట్టినట్లుగా సమాచారం.

Updated Date - 2021-06-23T15:25:24+05:30 IST