తబ్లీగీ వల్లే కరోనా వ్యాప్తి : కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-09-21T18:35:55+05:30 IST

నిజాముద్దీన్ లో జరిగిన తబ్లీగీత సమావేశం వల్లే దేశంలో కరోనా వ్యాప్తి జరిగిందని కేంద్ర హోంశాఖ సోమవారం

తబ్లీగీ వల్లే కరోనా వ్యాప్తి : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ : నిజాముద్దీన్ లో జరిగిన తబ్లీగీత సమావేశం వల్లే దేశంలో కరోనాఎక్కువ మందికి వ్యాప్తి చెందిందని కేంద్ర హోంశాఖ సోమవారం పునరుద్ఘాటించింది. ఇప్పటి వరకు 233 మంది జమాతే సభ్యులను అరెస్ట్ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. అంతేగాకుండా 2,361 మందిని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి తరలించినట్లు ఆయన వెల్లడించారు. జమాతే చీఫ్ మౌలానాపై దర్యాప్తు జరుగుతోందని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజాముద్దీన్ లో భౌతిక దూరం పాటించకుండా, కోవిడ్ జాగ్రత్తలు తీసుకోకుండా సభ నిర్వహించుకోవడం వల్లే కరోనా వ్యాప్తి జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-21T18:35:55+05:30 IST