నేటి నుంచి నులి పురుగుల నివారణకు మాత్రలు

ABN , First Publish Date - 2021-03-03T09:39:41+05:30 IST

చిన్నారుల్లో నులి పురుగుల నివారణకు ఆరోగ్యశాఖ నడుం బిగించింది. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం

నేటి నుంచి నులి పురుగుల నివారణకు మాత్రలు

అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల్లో నులి పురుగుల నివారణకు ఆరోగ్యశాఖ నడుం బిగించింది. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలోని చిన్నారులకు మాత్రలు అందించనున్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు సాగే ఈ కార్యక్రమంలో రెండు నుంచి 19 ఏళ్ల వయసున్న వారందరికీ అల్బెండ్‌జోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రులతోపాటు పాఠశాలలు, కళాశాలలు, సబ్‌సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలలో మాత్రలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మందికిపైగా నులిపురుగుల నివారణ మాత్రలు అందించనున్నారు.

Updated Date - 2021-03-03T09:39:41+05:30 IST