నేటి నుంచి నులి పురుగుల నివారణకు మాత్రలు
ABN , First Publish Date - 2021-03-03T09:39:41+05:30 IST
చిన్నారుల్లో నులి పురుగుల నివారణకు ఆరోగ్యశాఖ నడుం బిగించింది. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం
అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల్లో నులి పురుగుల నివారణకు ఆరోగ్యశాఖ నడుం బిగించింది. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలోని చిన్నారులకు మాత్రలు అందించనున్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు సాగే ఈ కార్యక్రమంలో రెండు నుంచి 19 ఏళ్ల వయసున్న వారందరికీ అల్బెండ్జోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రులతోపాటు పాఠశాలలు, కళాశాలలు, సబ్సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలలో మాత్రలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మందికిపైగా నులిపురుగుల నివారణ మాత్రలు అందించనున్నారు.