టీ-20 ప్రపంచకప్ వాయిదా.. తుది నిర్ణయం మే 28న?
ABN , First Publish Date - 2020-05-25T20:18:07+05:30 IST
ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. మే 28వ తేదీన అన్ని బోర్డులతో అంతర్జాతీయ క్రికెట్
ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. మే 28వ తేదీన అన్ని బోర్డులతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ)ను కొన్ని అడిగనున్నారు. ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా ఈ మేరకు సిద్ధంగా ఉందా.. అని తెలుసుకోనున్నారు.
సమావేశంలో సీఏను అడిగే ప్రశ్నలు:
1.అక్టోబర్లో 16 దేశలను ప్రజలను మీ దేశంలోకి ప్రభుత్వం అనుమతిస్తుందా?
2.ఆస్ట్రేలియాలో లాక్డౌన్ సెప్టెంబర్ వరకూ ఉంది. అలాంటి పరిస్థితిల్లో ప్రపంచకప్ నిర్వహించే అవకాశం ఉందా?
3.లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆస్ట్రేలియాలో ఉండబోయే క్వారంటైన్ నిబంధనలు ఏంటి?
4.పెద్దగా ప్రాక్టీస్ లేకుండా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వచ్చి అంత పెద్ద టోర్నమెంట్ ఆడుతారని మీరు భావిస్తున్నారా?
సమావేశంలో ఈ ప్రశ్నలపై వచ్చిన స్పష్టత తర్వాత ప్రపంచకప్ నిర్వాహణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.