T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
ABN , First Publish Date - 2021-11-11T00:55:01+05:30 IST
టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్కి ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య రంగం సిద్ధమైంది.
అబుధాబి: టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్కి ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని ఇంగ్లండ్తో బ్యాటింగ్ చేయించాలని నిర్ణయించాడు. ఈ స్టేడియంలో జరిగిన 14 మ్యాచ్లకు గాను 9 మ్యాచ్లను ఛేజింగ్ జట్లే గెల్చుకోవడం వల్ల న్యూజిలాండ్ కూడా టాస్ గెలిచి బౌలింగ్ చెయ్యాలని నిర్ణయించినట్లు క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఊపుమీదున్న ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ గాయం వల్ల టోర్నీ నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్ బ్యాటింగ్కు పెద్ద లోటు కాగా.... మంచి బౌలింగ్ యూనిట్తో కివీస్ ఎంతో బలంగా కనిపిస్తోంది.