T20: వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన కివీస్
ABN , First Publish Date - 2021-11-18T01:47:22+05:30 IST
T20 టోర్నీలో భాగంగా టీమిండియాతో తొలి మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు వెంట వెంటనే...
జైపూర్: T20 టోర్నీలో భాగంగా టీమిండియాతో తొలి మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు వెంట వెంటనే 2 వికెట్లు కోల్పోయింది. అర్థ శతకం సాధించిన బ్యాట్స్మేన్ మార్క్ చాప్మేన్ 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కాగా, ఇతని స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ పరుగులేమీ చెయ్యకుండానే డకౌటై పెవిలియన్ బాట పట్టాడు. 14వ ఓవర్లో అశ్విన్ బంతికి చాప్మేన్ క్లీన్ బౌల్డ్ అయిన వెంటనే గ్లెన్ కూడా అశ్విన్ బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. గ్లెన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ బ్యాట్ పట్టాడు. 14 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఓపెనర్ గుప్తిల్ 50 పరుగులు చేసి అర్థ శతకం సాధించాడు.