T20: తొలి ఓవర్లోనే కివీస్ తొలి వికెట్ ఔట్
ABN , First Publish Date - 2021-11-18T00:55:08+05:30 IST
టీమిండియాతో ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న తొలి T20 మ్యాచ్లో తొలి ఓవర్ 3వ బంతికే...
జైపూర్: టీమిండియాతో ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న తొలి T20 మ్యాచ్లో తొలి ఓవర్ 3వ బంతికే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో ఓపెనర్ డారెల్ మిషెల్ పరుగులేమీ చెయ్యకుండా డకౌట్ అయ్యాడు. మిషెల్ స్థానంలో బ్యాట్ పట్టిన మార్క్ చాప్మేన్ మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్తో క్రీజులో ఉన్నాడు. 4 ఓవర్లు ముగిసేసరికి కివీస్ న్యూజిలాండ్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసింది. చాప్మేన్ 15 పరుగులు, గుప్తిల్ 3 పరుగుల వ్యక్తిగత స్కోర్లతో ఆడుతున్నారు.