T20: హాఫ్ సెంచరీతో చాప్మేన్ దూకుడు
ABN , First Publish Date - 2021-11-18T01:29:13+05:30 IST
టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మేన్...
జైపూర్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మేన్ అర్థ శతకం సాధించి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓపెనర్ డారెల్ మిషెల్ నిష్క్రమణతో బరిలోకి దిగిన చాప్మేన్ మొత్తం 46 బంతులు ఎదుర్కొని 5 బౌండరీలు, 2 సిక్సర్లతో ఈ అర్థ శతకం సాధించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు 96 పరుగులు చేసింది. ఓపెనర్ గుప్తిల్ 35 పరుగులు, చాప్మేన్ 56 పరుగులతో క్రీజులో ఉన్నారు.