T20: భారీలక్ష్యం దిశగా పాక్ జట్టు
ABN , First Publish Date - 2021-11-12T02:38:59+05:30 IST
ఆసీస్తో మధ్య ఇక్కడ జరుగుతున్న T20 ప్రపంచకప్ 2వ సెమీఫైనల్ పోటీలో పాక్ జట్టు భారీ లక్ష్యం దిశగా సాగుతోంది.
దుబాయ్: ఆసీస్తో మధ్య ఇక్కడ జరుగుతున్న T20 ప్రపంచకప్ 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాక్ జట్టు భారీ లక్ష్యం దిశగా సాగుతోంది. 19 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ జట్టు 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ బాబర్ (39), మహమ్మద్ రిజ్వాన్ (67)లు నిలకడైన ఆటతో రాణించి నిష్క్రమించగా అసిఫ్ అలీ పరుగులేమీ చెయ్యకుండా డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఫఖర్ జమాన్ (41) పరుగులతో ఆడుతుండగా అసిఫ్ అలీ స్థానంలో షోయబ్ మాలిక్ బ్యాట్ పట్టాడు.