TS News: మరోసారి వస్తే బాగోదు: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2022-10-02T19:11:18+05:30 IST
Hyderabad: బీజేపీ కార్యాలయంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రవేశించారు. దీంతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కార్యాలయంలోకి వస్తే బాగోదని కిషన్రెడ్డి హెచ్చరించారు. ప్రగతిభవన్, తెలంగాణ భవన్లో ఐబీ వాళ్లను పెడతా సీఎం ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ ఇంటెలిజెన్స్వారికి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేస్తానంటూ కిషన్రెడ్డి మండిపడ్డారు.
Hyderabad: బీజేపీ కార్యాలయంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రవేశించారు. దీంతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కార్యాలయంలోకి వస్తే బాగోదని కిషన్రెడ్డి హెచ్చరించారు. ప్రగతిభవన్, తెలంగాణ భవన్లో ఐబీ వాళ్లను పెడతా సీఎం ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ ఇంటెలిజెన్స్వారికి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేస్తానంటూ కిషన్రెడ్డి మండిపడ్డారు.