టీ అక్రమ ప్రాజెక్టులు కేఆర్ఎంబీలోకి వద్దు
ABN , First Publish Date - 2021-04-16T10:27:07+05:30 IST
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోనికి తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను తేవొద్దని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల
కేంద్ర జలశక్తి కార్యదర్శికి సాగునీటి వినియోగదారుల సమాఖ్య లేఖ
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోనికి తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను తేవొద్దని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్కు లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలో చేర్చితే రాష్ట్రం 120 టీఎంసీలు కోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం ఫోర్షోర్ నుంచి నీటిని తోడేస్తే రాయలసీమకు కృష్ణా జలాలు అందవని ఆందోళన వ్యక్తం చేశారు.