వనసమారాధనలు ఐక్యతకు ప్రతీకలు

ABN , First Publish Date - 2021-11-28T05:29:33+05:30 IST

ఐక్యతకు ప్రతీకలు వన సమారాధానలని అనపర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జేవీవీ సుబ్బారెడ్డి అన్నారు. జిల్లాలో పలుచోట్ల శనివారం కార్తీక వనసమారాధనలు జరిగాయి.

వనసమారాధనలు ఐక్యతకు ప్రతీకలు
అనపర్తి: రామవరంలో ఉసిరి చెట్టుకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే దంపతులు

బిక్కవోలు, నవంబరు 27: ఐక్యతకు ప్రతీకలు వన సమారాధానలని అనపర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జేవీవీ సుబ్బారెడ్డి అన్నారు. జిల్లాలో పలుచోట్ల శనివారం కార్తీక వనసమారాధనలు జరిగాయి. బిక్కవోలులోని శ్రీగోపాలకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారెడ్డిని యాదవ సంఘ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బుద్దాల కన్నారావుయాదవ్‌, కాకినాడ స్మార్ట్‌ సిటీ చైర్మన్‌ అల్లు రాజుబాబుయాదవ్‌, జిల్లా గౌరవ ముఖ్య సలహాదారు నక్కేల బాబురావుయాదవ్‌, యాదవ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బుద్దాల ప్రహ్లాదకుమార్‌యాదవ్‌, జోగ నూకరాజుయాదవ్‌, యలమంచిలి శ్రీనుయాదవ్‌, యామసాని రవి, లక్ష్మీగణపతి ఆలయ చైర్మన్‌ నాగశ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:29:33+05:30 IST