సునీత చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టి పెట్టలేదు: సయ్యద్ రఫీ

ABN , First Publish Date - 2021-04-13T21:08:59+05:30 IST

వివేకా హత్యకేసు విచారణలో సునీత చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదని సయ్యద్ రఫీ ప్రశ్నించారు.

సునీత చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టి పెట్టలేదు: సయ్యద్ రఫీ

అమరావతి: వివేకా హత్యకేసు విచారణలో ఆయన కుమార్తె సునీత చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు అనుమానితులను వదిలేసి పూలు, పాలు, పండ్లు అమ్మేవారిని విచారిస్తే ఏం లాభమన్నారు. శవానికి ఎవరు  కుట్లు వేశారో, ఎవరి ప్రయోజనాల కోసం వేశారో సీబీఐ ఎందుకు తేల్చలేదని నిలదీశారు.


వివేకా హత్యకేసుతో తనకు సంబంధముందని నిరూపిస్తే, ఉరేసుకుంటానని ఆదినారాయణ రెడ్డి చెప్పారని, మరి వివేకా హత్యతో తమకు సంబంధంలేదని  వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నారని సయ్యద్ రఫీ ప్రశ్నించారు. వారి చేతికి అంటిన రక్తాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత వారిద్దరిపై లేదా? అని అన్నారు. తనను ఎవరు చంపారో తెలియక వివేకా ఆత్మ రాజప్రాసాదం చుట్టూ తిరుగుతోందని, వివేకాహత్యకేసులో అన్నివేళ్లు జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలవైపే చూపిస్తున్నాయని సయ్యద్ రఫీ అన్నారు.

Updated Date - 2021-04-13T21:08:59+05:30 IST