వేర్పాటునేత గిలానీ మృతదేహంపై పాక్ జెండా... కేసు నమోదు!

ABN , First Publish Date - 2021-09-05T13:32:15+05:30 IST

వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ రాడికల్ ఫ్యాక్షన్ నేత...

వేర్పాటునేత గిలానీ మృతదేహంపై పాక్ జెండా... కేసు నమోదు!

శ్రీనగర్: వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ రాడికల్ ఫ్యాక్షన్ నేత సయ్యద్ అలీ షా గిలానీ బుధవారం కన్నుమూశారు. ఆ తరువాత గిలానీ మృతదేహానికి పాకిస్తాన్ జెండాతో చుట్టడంతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై బడ్గామ్ పోలీసులు అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ సెప్టెంబరు ఒకటిన రాత్రి వేళ గిలానీ ఇంటి వద్ద చట్ట వ్యతికేక కార్యకలాపాలు చోటు చేసుకోవడంపై కేసు నమోదు చేశామన్నారు. 


గిలానీ మృతి అనంతరం కొందరు మహిళలు... పోలీసులతో గొడవకు దిగారన్నారు. ఆ తరువాత వారు గిలానీ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తీసుకువెళ్లి, ఖననం చేశారన్నారు. ఈ సందర్భంగా తీసిన ఒక వీడియోలో గిలానీ మృతదేహానికి పాకిస్తాన్ జెండా కప్పివుంచడం స్పష్టంగా కనిపించిందన్నారు. గిలానీ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ తన 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Updated Date - 2021-09-05T13:32:15+05:30 IST