కలెక్టర్ డీపీతో సైబర్ నేరగాడు మోసం
ABN , First Publish Date - 2022-06-26T04:52:25+05:30 IST
ఓ అధికారిని కలెక్టర్ డీపీతో ఓ సైబర్ నేరగాడు మోసం చేయడంపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు(క్రైం), జూన్ 25: ఓ అధికారిని కలెక్టర్ డీపీతో ఓ సైబర్ నేరగాడు మోసం చేయడంపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల మేరకు నగరంలోని కావేరినగర్లో ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్సు ఏడీ హనుమాన్ ప్రసాద్ నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న కలెక్టర్ డీపీగా పెట్టుకున్న ఓ సైబర్ నేరగాడు అతనితో చాట్ చేశాడు. చాటింగ్లో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లింక్ద్వారా ఒక్కో గిఫ్ట్ కార్డుకు రూ.10వేల చొప్పున 15కార్డులకు నగదు కట్టాలని సైబర్నేరగాడు మెసేజ్చేశాడు. దీంతో ఆయన తన అల్లుడు సాయికృష్ణ అకౌంట్ నుంచి రూ.1.50 లక్షలు చెల్లించారు. నగదు కట్టిన గిఫ్ట్కార్డు, కనీస వివరాలు సైతం రాకపోవడంతో సాయికృష్ణ శనివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కె నరసింహారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.