శ్యామ్ప్రకాష్ ముఖర్జీకి ఘన నివాళి
ABN , First Publish Date - 2021-06-24T04:20:11+05:30 IST
భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నాయకుడు శ్యామ్ప్రకాష్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు.
కోవూరు, జూన్ 23: భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నాయకుడు శ్యామ్ప్రకాష్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు ఐనకోట రఘురామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామ్ప్రసాద్ ప్రాణత్యాగం వల్లనే కాశ్మీర్, భారత్లో అంతర్భాగంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివుని రామిరెడ్డి, బేతిరెడ్డి నగేష్, పచ్చిపాల హరనాధరెడ్డి, పైనం బుజ్జమ్మ, తాండ్ర శ్రీనివాసులు, ఈగా సురేష్, శ్రీకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇనమడుగులో: మండల పరిధిలోని ఇనమడుగులో శ్యామ్ప్రకాష్ ముఖర్జీకి బీజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తోటిరెడ్డి సుధాకరరెడ్ఢి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ లీగల్సెల్ కార్యదర్శి దాసరి రాజేంద్రప్రసాద్, బీజేపీ నాయకులు కనిశెట్టి మురళీకృష్ణ, అశోక్, నాగరాజు, బాలకృష్ణ, గోపి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డిపాళెం : బుచ్చిరెడ్డిపాళెంలోని రామకృష్ణానగర్తో పాటు పలుచోట్ల బీజేపీ నాయకుడు రామిశెట్టి మోహన్బాబు ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మండలంలోని పెనుబల్లి, మునులపూడి, ఇస్కపాళెం పంచాయతీల్లో బీజేపీ మండల అధ్యక్షుడు గండి రఘురామయ్య ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు, నాయకులు ఆలూరు శేషసాయి, పెంచల ప్రసాద్, కొప్పోలు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
వెంకటాచలం : వెంకటాచలంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం భారతీయ జనసంఘ్ (బీజేపీ) వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 68వ వర్ధంతిని బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్లర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్, బీజేపీ జిల్లా కార్యదర్శి అల్లూరు ప్రసాద్నాయుడు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పిల్లిపాకుల పెంచలయ్య, జీ. అశ్విని, నాయకులు సండిబోయిన శ్రీనివాసులు యాదవ్, బండి వినోద్ పాల్గొన్నారు.