న్యాయవాదుల హత్య కేసులో కత్తి స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-02T01:08:24+05:30 IST

జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు, నాగమణి

న్యాయవాదుల హత్య కేసులో కత్తి స్వాధీనం

పెద్దపల్లి: జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు, నాగమణి  దంపతుల హత్యకు నిందితులు ఉపయోగించిన ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాద దంపతుల హత్య తరువాత కత్తులను సుందిళ్ల ప్రాజెక్టులో నిందితులు పడవేశారు. దీంతో కేసు విచారణలో కత్తులు ఆధారం కానున్నాయి. సుందిళ్ళ ప్రాజెక్టు నుంచి వెలికితీయడానికి గజ ఈతగాళ్లను పోలీసులు పిలిపించారు. ఈతగాళ్ళు కత్తులు నిమిత్తం సుందిళ్ళ ప్రాజెక్టులో వెతికారు. ప్రాజెక్టులోని 53, 54 గేట్ల దగ్గర ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో కత్తి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. అయితే మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 


జంట హత్యల కేసులో నిందితులకు ఆయుధాలు, వాహనాన్ని బిట్టు శ్రీను సమకూర్చాడు. జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు బిట్టు శ్రీను మేనల్లుడు. 

Updated Date - 2021-03-02T01:08:24+05:30 IST