ఈతకు వెళ్లి ముగ్గురు బాలుర మృతి

ABN , First Publish Date - 2022-04-04T01:46:45+05:30 IST

గిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఊరకుంట చెరువులో ఈత కోసం వెళ్లి మారంపెల్లి శరత్‌ (14), పబ్బతి నవదీప్‌

ఈతకు వెళ్లి ముగ్గురు బాలుర మృతి

ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఊరకుంట చెరువులో ఈత కోసం వెళ్లి మారంపెల్లి శరత్‌ (14), పబ్బతి నవదీప్‌ (11), గొలుసుల యశాంత్‌ (13) నీట మునిగి ఆదివారం మృతి చెందారు. ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావటం వల్ల ఉదయమే ముగ్గురు బాలురు ఈత కోసం తుమ్మెనాలకు సమీపంలో ఉన్న ఊరకుంట చెరువు వద్దకు వెళ్లారు. స్నానం కోసం నీటిలో దిగిన బాలురు ఈత రాక పోవటం నీట మునిగి మృతి చెందారు. సెలవు దినం కావటం వల్లే ముగ్గురు ఈత కోసం చెరువు వద్దకు వెళ్లారని, ఈత రాక పోవడం వల్ల మునిగి మృతి చెందినారని భావిస్తున్నారు. 

Updated Date - 2022-04-04T01:46:45+05:30 IST