ఈతలో రికార్డు నెలకొల్పిన బాలిక

ABN , First Publish Date - 2022-04-26T15:44:05+05:30 IST

చెన్నై కోట్టూరుపురం ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక సంజనా స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పింది. కోట్టూరుపురానికి చెందిన కానిస్టేబుల్‌ పెరుమాళ్‌, సంధ్యా దంపతుల కుమార్తె

ఈతలో రికార్డు నెలకొల్పిన బాలిక

చెన్నై: చెన్నై కోట్టూరుపురం ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక సంజనా స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పింది. కోట్టూరుపురానికి చెందిన కానిస్టేబుల్‌ పెరుమాళ్‌, సంధ్యా దంపతుల కుమార్తె సంజనా ఆరోతరగతి చదువుతోంది. చిన్నప్పటి ఈత పోటీల్లో ఎక్కువగా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆ బాలిక వీజీపీ గోల్డెన్‌ బీచ్‌ నుంచి చెన్నై మెరీనాబీచ్‌ కన్నగి విగ్రహం తీరం వరకూ (25కి.మీ.ల దూరాన్ని) నిర్విరామంగా ఈదుకుంటూ ఉదయం 11.30 గంటలకు గమ్యస్థానాన్ని చేరుకుని ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా వివేకానందర్‌ కలైఅరంగం ఏర్పాటైన సభలో సంజనాను హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి కృపాకరన్‌ తదితర ప్రముఖులు అవార్డు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.


Updated Date - 2022-04-26T15:44:05+05:30 IST