ఇన్‌స్టామార్ట్‌ సేవల్లో స్విగ్గీ రూ.5,250 కోట్ల పెట్టుబడి

ABN , First Publish Date - 2021-12-03T07:34:36+05:30 IST

ఇంటివద్దకు ఆహారం డెలివరీ చేసే ఆన్‌లైన్‌ వేదిక స్విగ్గీ.. వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తోంది.

ఇన్‌స్టామార్ట్‌ సేవల్లో స్విగ్గీ రూ.5,250 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: ఇంటివద్దకు ఆహారం డెలివరీ చేసే ఆన్‌లైన్‌ వేదిక స్విగ్గీ.. వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తోంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ పేరుతో గత ఏడాది ప్రారంభించిన కిరాణా సరుకుల ఎక్స్‌ప్రెస్‌ డెలివరీ సేవల్లో 70 కోట్ల డాలర్ల (దాదాపు రూ.5,250 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. తొలుత గురుగ్రామ్‌, బెంగళూరులో ఆరంభించిన ఇన్‌స్టామార్ట్‌ సేవల్ని కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌, వైజాగ్‌ సహా 18 నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలకు వారానికి 10 లక్షలకు పైగా ఆర్డర్లు వస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది. కిరాణా సరుకుల ఎక్స్‌ప్రెస్‌ డెలివరీ (క్విక్‌ కామర్స్‌) సేవల్లో స్విగ్గీ ప్రస్తుతం జొమాటో, డుంజో, ఓలాతో పోటీపడుతోంది. 

Updated Date - 2021-12-03T07:34:36+05:30 IST