కరోనా మహమ్మారి మళ్లీ ప్రజలను తాకకూడదు
ABN , First Publish Date - 2022-05-17T08:52:12+05:30 IST
కరోనా మహమ్మారి మళ్లీ ప్రజలను తాకకూడదని కోరుకుంటున్నట్టు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.
స్వరూపానందేంద్ర సరస్వతి
తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి మళ్లీ ప్రజలను తాకకూడదని కోరుకుంటున్నట్టు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. సోమవారం ఉదయం ఆయన పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వరూపానందేంద్ర ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తగ్గడంతో భక్తులు అధికంగా తిరుమలలో కనిపిస్తున్నారన్నారు. ప్రజలకు శ్రీవారి దయ ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.