ఏపీలో ఎక్కడా తిరగలేని పరిస్థితి: స్వరూపానందేంద్ర
ABN , First Publish Date - 2022-01-08T18:17:58+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాల నుండి హిమాలయాలు, రుషికేష్ తిరుగుతున్నానని... కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా తిరగలేని పరిస్థితి ఉందన్నారు. తెలుగును మించిన భాష మరొకటి లేదని చెప్పారు. తెలుగును ఎవరూ చంపలేరని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ, ప్రజా నాయకులు, అధికారులు యాసతో భాషను చంపకూడదన్నారు. సినీ పరిశ్రమ దగ్గరి నుంచి క్రింది స్థాయి వరకు అదే జరుగుతోందని ఆవేదన చెందారు. పిల్లలకు తల్లిదండ్రులు భాష నేర్పకుండా స్కూల్లో ఇంగ్లీష్ కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. తల్లి భాష, మాతృభాష ఏకైక భాష తెలుగు భాష అని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.