ఎందరో త్యాగఫలితం స్వరాజ్యం

ABN , First Publish Date - 2022-08-16T06:28:07+05:30 IST

ఎందరో త్యాగఫలితమే నేటి స్వరాజ్యమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనఛార్జీ కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

ఎందరో త్యాగఫలితం స్వరాజ్యం
తనకల్లులో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం


మాజీ ఎమ్మెల్యే కందికంట 

కదిరి, ఆగస్టు 15: ఎందరో త్యాగఫలితమే నేటి స్వరాజ్యమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనఛార్జీ కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం 75వ స్వాతంత్య్ర వేడుకల్లో ఆజాదీకా అమృత మహోత్సవంలో బాగంగా టీడీపీ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిం చారు. ర్యాలీ స్థానిక మదనపల్లి రోడ్డులోని దేవర చెరువు నుంచి జీవిమాన సర్కిల్‌, అంబేద్కర్‌ సర్కిల్‌, వేమారెడ్డి సర్కిల్‌, టవర్‌క్లాక్‌ మీదుగా కొనసాగింది. దేశభక్తి నినాదాల తో పట్టణం మార్మోగింది. ఈసందర్భంగా కందికుంట మాట్లాడుతూ ఎంతోమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి స్వరాజ్యం సాధించారని తెలిపారు. వారి త్యాగఫలితమే నేడు స్వేచ్చావాయువని చెప్పారు. స్వరాజ్య ఫలితాలను అందరికి అందేలా చూడాలని సూచించారు. 

తనకల్లు : మండల పరిధిలోని కొక్కంట క్రాస్‌నుంచి తనకల్లు వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికంఉట వెంకటప్రసాద్‌ ఆదేశాలమేరకు నిర్వహించినట్లు మండల కన్వీనర్‌ రెడ్డిశేఖర్‌రెడ్డి, కోర్తికోట మాజీ సర్పంచ ఎస్‌కే మస్తానవలి తెలిపారు.   కదిరిలో జరగనున్న ర్యాలీలో పాల్గొనున్నట్లు చె ప్పారు. నాయకులు బడా రాజారెడ్డి, బీగం శంకర్‌నాయుడు, తెలుగుయువత అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌, సోంపాళ్యం నాగభూషణం, పీజీ మల్లికార్జున, హరినాయక్‌, వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T06:28:07+05:30 IST