అశ్వవాహనంపై ఖాద్రీశుడి వైభోగం

ABN , First Publish Date - 2022-10-07T05:04:00+05:30 IST

శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి.

అశ్వవాహనంపై ఖాద్రీశుడి వైభోగం

కదిరి నృసింహాలయంలో ముగిసిన దసరా ఉత్సవాలు

కదిరి, అక్టోబరు 6: శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. దసరా రోజున నరసింహస్వామి అశ్వ వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఉదయం ఆలయ అర్చకులు ుశమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నరసింహస్వామి అశ్వవాహనంపై తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్‌, పాలకమండలి చైౖర్మన జెరిపిటి గోపాలకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-07T05:04:00+05:30 IST