మస్కట్‌లో స్వామి వివేకానంద జయంతి

ABN , First Publish Date - 2021-01-15T23:27:32+05:30 IST

జనవరి 12న స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని శుక్రవారం రోజున ఒమాన్‌లోని ఇండియన్

మస్కట్‌లో స్వామి వివేకానంద జయంతి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: జనవరి 12న స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని శుక్రవారం రోజున ఒమాన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ సంస్కృత వింగ్.. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ తరఫున నరేంద్ర పన్నీరుతో పాటు కుమార్ మంచికట్ల, వేమన్ కుమార్ కాశ, శ్యాం మామిడి, రమేష్ గరిగే, సుద్దాల గంగరాజం, పందిరి శంకర్, రాజు కోదమగారి, 40 మంది కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ.. అన్ని దానాలలో కెల్లా రక్త దానం గొప్పదన్నారు. ప్రస్తుతం ఒమాన్‌లోని బ్లడ్ బ్యాంకులలో రక్తం కొరత ఎక్కువగా ఉందన్నారు. కార్యకర్తలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.




Updated Date - 2021-01-15T23:27:32+05:30 IST