వైభవంగా స్వామివారి రథోత్సవం
ABN , First Publish Date - 2022-05-19T05:27:53+05:30 IST
వైభవంగా స్వామివారి రథోత్సవం
- భారీగా హాజరైన భక్తులు
కేశంపేట, మే18: కేశంపేట మండలం ఎక్లా్సఖాన్పేటలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయం నుంచి గ్రామ పురవీధులగుండా సాగిన ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. అంతకుముందు భక్తులు స్వామివారి రథానికి నీటితో సాక పెట్టారు. రథం లాగుతున్న సమయంలో గోవిందనామ స్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. అనంతరం ఆలయంలో సాముహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. రథోత్సవంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, సర్పంచ్ కవితరవీందర్ యాదవ్, మురళీకృష్ణ యాదవ్, వెంకన్న, బాలకృష్ణ, సురేష్ యాదవ్, బ్రహ్మచారి, రొల్లు గణేష్, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.