గిరిజన గురుకులానికి స్వచ్ఛ విద్యాలయ పురస్కారం

ABN , First Publish Date - 2022-06-26T06:02:42+05:30 IST

ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్వచ్ఛ విద్యాలయం పురస్కారాన్ని పొందిన ఏకైక పాఠశాలగా జగ్గయ్యపేట గిరిజన గురకుల పాఠశాల నిలిచింది.

గిరిజన గురుకులానికి స్వచ్ఛ విద్యాలయ పురస్కారం
కలెక్టర్‌ రంజిత్‌ బాషా నుంచి మెమొంటో, ప్రశంసాపత్రం అందుకుంటున్న ప్రిన్సిపాల్‌ దేవరాజ్‌

జగ్గయ్యపేట, జూన్‌ 25: ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్వచ్ఛ విద్యాలయం పురస్కారాన్ని పొందిన ఏకైక పాఠశాలగా జగ్గయ్యపేట గిరిజన గురకుల పాఠశాల నిలిచింది.  రాష్ట్రంలోని విద్యాలయాల్లో కొవిడ్‌-19లో పాఠశాల నిర్వహణ, నాడు-నేడు అమలు,  వైద్య, ఆరోగ్య, పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత తదితర ఎనిమిది  అంశాలను  నిపుణులు పరిశీలించి ఈ పురస్కారానికి ఎంపిక చే శారని గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ జాన్సన్‌ దేవరాజ్‌ తెలిపారు. అన్ని అంశాలో 5 స్టార్‌ రేటింగ్‌లో జిల్లాలో ఈ పురస్కారం పొందిన ఏకైక ఉన్నత పాఠశాలగా గుర్తించబడటం ఆనందంగా ఉందని దేవరాజ్‌ అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషితో దీనిని సాధించామన్నారు. పురస్కారాన్ని ఉమ్మడి జిల్లా స్వచ్ఛ విద్యాలయ కో ఆర్డినేటర్‌, కృష్ణా కలెక్టర్‌ రంజిత్‌ బాషా నుంచి అందుకున్నట్టు తెలిపారు.


Updated Date - 2022-06-26T06:02:42+05:30 IST