స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు ప్రదానం

ABN , First Publish Date - 2022-07-08T04:17:16+05:30 IST

జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని కలెక్టర్‌ భారతి హోళి కేరి అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ అవార్డు ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్‌రావుతో కలిసి ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. కలె క్టర్‌ మాట్లాడుతూ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ అవార్డులకు 21 పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు.

స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు ప్రదానం
పురస్కారం అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 7: జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని కలెక్టర్‌ భారతి హోళి కేరి అన్నారు. గురువారం కలెక్టర్‌  కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ అవార్డు ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్‌రావుతో కలిసి ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. కలె క్టర్‌ మాట్లాడుతూ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ అవార్డులకు  21 పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. ఈ అవార్డుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సం యుక్తంగా చేపట్టిన సర్వేలో పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు క్రమశి క్షణ, పారిశుధ్యం, పరిశుభ్రత, ఆరోగ్యం, తాగు నీరు, మరుగుదొడ్లు, సత్ప్రవర్తన వంటి అంశాలపై విచారించి పాఠశాలలను ఎంపిక చేశారని తెలిపారు.  ఇదే స్ఫూర్తితో  మరిన్ని అవార్డులకు ఎంపిక య్యేలా కృషి చేయాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి  వెంకటేశ్వర్లు, జిల్లా  సెక్టోరల్‌ అధికారి  చౌదరి, జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, ప్రధానోపాద్యాయులు పాల్గొన్నారు.    

Updated Date - 2022-07-08T04:17:16+05:30 IST