స్వచ్ఛతా పక్షోత్సవాలు
ABN , First Publish Date - 2022-05-18T06:29:24+05:30 IST
స్వచ్ఛతా పక్షోత్సవాలు
నున్న హైస్కూల్, పంచాయతీకి డస్ట్బిన్ల పంపిణీ
విజయవాడ రూరల్, మే 17 : నున్నలోని పవర్గ్రిడ్లో స్వచ్ఛతా పక్షోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న పక్షోత్సవాలలో పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పవర్గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ వైఎస్ సాయి ప్రసాద్ తెలిపారు. పవర్గ్రిడ్ వద్ద జరిగిన కార్యక్రమంలో నున్న జడ్పీ హైస్కూల్, పంచాయతీతోపాటు స్థానికులకు ఆయన డస్ట్బిన్లను పంపిణీ చేశారు.