100 మందికి స్వాబ్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-06-29T10:21:49+05:30 IST
మండలంలో 100 మందికి ఆదివారం కరోనా స్వాబ్ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ చంద్రిక తెలిపారు.
ముద్దనూరు జూన్28: మండలంలో 100 మందికి ఆదివారం కరోనా స్వాబ్ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ చంద్రిక తెలిపారు. ముద్దనూరులో 20 మందికి , శెట్టివారిపల్లెలో 55 మందికి, మంగపట్నంలో 15 మందికి, కొర్రపాడులో 10 మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ తెలిపారు. ముద్దనూరు మండలం పరిధిలోని దేనేపల్లె గ్రామంలో ఆదివారం ఒక కరోనా పాజిటివ్ కేసునమోదు కాగా అతనిని క్వారంటైన్ తరలించినట్లు డాక్టర్ తెలిపారు.