Svbc: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
ABN , First Publish Date - 2022-08-01T01:11:53+05:30 IST
తిరుమల శ్రీవారి శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ట్రస్టుకు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.
తిరుమల: తిరుమల శ్రీవారి శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ట్రస్టుకు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. మహారాష్ట్రలోని ఔరంగబాద్కు చెందిన భక్తులు సురేష్ అజ్మీర్, సాగర్ అజ్మీర్ కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. విరాళం డీడీని తిరుమలలోని నాదనీరాజనం వేదిక వద్ద ఎంపీ సంజయ్ జాదవ్, రమాకంత్జీ వ్యాస్ మహరాజ్ సమక్షంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.