పోకిరివి.. నీతో పెళ్లా అన్నందుకే!

ABN , First Publish Date - 2021-10-28T09:14:43+05:30 IST

స్టాఫ్‌నర్స్‌ నాగచైతన్య అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ దాదాపు వీడింది. అనుమానించినట్లుగానే ప్రియుడు కోటిరెడ్డే నిందితుడు ..

పోకిరివి.. నీతో పెళ్లా అన్నందుకే!

ప్రియుడి ఆగ్రహం.. ప్రేయసిని గొంతుకోసి హత్య

స్టాఫ్‌నర్స్‌ నాగచైతన్య హత్య కేసులో నిందితుడి అరెస్టు 

హైదరాబాద్‌ సిటీ అక్టోబర్‌ 27(ఆంధ్రజ్యోతి): స్టాఫ్‌నర్స్‌ నాగచైతన్య అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ దాదాపు వీడింది. అనుమానించినట్లుగానే ప్రియుడు కోటిరెడ్డే నిందితుడు అని తేలింది. తాను పెళ్లికి నిరాకరించడంతో ఆమె క్షణికావేశంలో గొంతు కోసుకొని చనిపోయిందని పోలీసుల ఎదుట అతడు చెప్పింది కట్టుకథ అని విచారణలో తేలిపోయింది. రెండ్రోజులు ఆమెతో కలిసి లాడ్జి గదిలో ఉన్న అతడే ఆమెను దారుణంగా హత్యచేశాడని తేలింది. తనతో పెళ్లికి ఆమె నిరాకరించడంతోనే మెడపై కొత్తితో దాడిచేసి చంపినట్లు విచారణలో కోటిరెడ్డి చెప్పాడు. ‘పనీపాటా లేకుండా పోకిరీగా తిరుగుతున్నావు.. నిన్ను పెళ్లి చేసుకోను. ఏదైనా పని చేసుకో. అప్పుడు ఆలోచిస్తా’ అని ఆమె తేల్చి చెప్పడంతో ఆగ్రహానికి గురై అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో తేల్చా రు. ఏపీలోని ప్రకాశంజిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన నాగచైతన్య హైదరాబాద్‌లోని నల్లగండ్ల సిటిజన్‌ ఆస్పత్రిలో స్టాప్‌నర్సుగా పనిచేస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన కోటిరెడ్డి ఒంగోలులో మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌గా పనిచేసేవాడు. హైదరాబాద్‌కు రాక ముందే నాగచైతన్యకు కోటిరెడ్డితో  పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. 


నాగచైతన్య హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కోటిరె డ్డి ఉద్యోగం వదిలేసి మకాం మార్చాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఖాళీగా తిరుగుతున్నాడు. వీ లున్నప్పుడల్లా నాగచైతన్య వద్దకు వచ్చి పెళ్లి ప్రసా ్తవన తెచ్చేవాడు. నువ్వు పనిపాట లే కుండా పోకిరీగా తిరుగుతున్నావ్‌, నువ్వ ఏదైనా ఉద్యోగం చూసుకో లేదంటే పెళ్లి చేసుకోను అంటూ నాగచైతన్య తెగేసి చెప్పేది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ప్రేయసిని పెళ్లికి ఒప్పించాలి లేదంటే చంపేయాలనే పథకంతో కోటిరెడ్డి ఈనెల 23న నాగచైతన్యను నల్లగండ్లలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. రెండ్రోజులు ఇద్దరూ అ క్కడే ఉన్నారు. రెండ్రోజుల తర్వాత ఇద్దరి మధ్య పెళ్లి విష యం చర్చకు వచ్చింది. కోటిరెడ్డిని పెళ్లి చేసుకోవడానికి నాగచైతన్య ఒప్పుకోలేదు.


‘నువ్వు వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నా వు.. అందుకే నాతో పెళ్లి వద్దంటున్నావు’ అంటూ ఆమెతో  కోటిరెడ్డి వాగ్వాదానికి దిగాడు. ‘నువ్వు పోకిరీగా తిరుగుతున్నావ్‌ అందుకే చేసుకోను’ నాగచైతన్య, చీవాట్లు పెట్టింది. అప్పటికి కూల్‌గా ఉన్న కోటిరెడ్డి, ఆమె నిద్రలోకి జారుకున్నాక  తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలో ఉన్న నాగచైతన్యను గొంతును కోసి హత్య చేశాడు. ఆ తర్వాత గదిలోనే ఉరేసుకోవాలని లేదంటే పొడుచుకోవాలని ప్రయత్నించాడు. ధైర్యం సరిపోక కడుపులో, మెడ బాగంలో కొద్దిగా పొడుచుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు మెడకు టవల్‌ చుట్టుకొని గదికి తాళం వేసి ఒంగోలుకు పారిపోయాడు. అక్కడి వెళ్లిన తర్వాత రిమ్స్‌లో చేరాడు.  


Updated Date - 2021-10-28T09:14:43+05:30 IST