అరకు లోయలో వ్యక్తి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-06-29T15:13:33+05:30 IST
జిల్లాలోని అరకులోయ ట్రైబల్ మ్యూజియం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అల్లూరి సీతారామరాజు: జిల్లాలోని అరకులోయ ట్రైబల్ మ్యూజియం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల భాగం పూర్తిగా కమిలిపోయి ఉండడంతో హత్యగా అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అరకులోయ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి సుమారు 45 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.