జూనియర్‌ ఆర్టిస్ట్‌ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-01-19T15:30:03+05:30 IST

మలక్‌పేట్‌లో ఉంటున్న జూనియర్‌ ఆర్టిస్ట్‌ జ్యోతిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

జూనియర్‌ ఆర్టిస్ట్‌ అనుమానాస్పద మృతి

నిందితులను గుర్తించాలని సహచరుల ఆందోళన

హైదరాబాద్‌ సిటీ/చాదర్‌ఘాట్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మలక్‌పేట్‌లో ఉంటున్న జూనియర్‌ ఆర్టిస్ట్‌ జ్యోతిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై విచారణ జరిపి నిందితులను గుర్తించాలని స్నేహితులు, సహచరులు ఆందోళనకు దిగారు. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి మంగళవారం ఉదయం షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ పట్టాలపై గాయాలతో పడి ఉన్నారు. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు షాద్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం స్నేహితులు యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతురాలి సహచరులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. జ్యోతిరెడ్డి మృతిపై అనుమానాలున్నాయని, విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.సులు వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. 

Updated Date - 2022-01-19T15:30:03+05:30 IST