ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-10-24T10:28:58+05:30 IST
మండలంలోని మైల్వార్, కాశీంపూర్ పంచా యతీల కార్యదర్శులు లావణ్య, శ్రావణి సస్పెండ్ అయ్యారు. ఆయా పంచాయతీల్లో ప్రభుత్వం చేపట్టిన ఆస్తుల నమోదు సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గడువులోగా సర్వే పూర్తి చేయక పోవడంతో
బషీరాబాద్: మండలంలోని మైల్వార్, కాశీంపూర్ పంచా యతీల కార్యదర్శులు లావణ్య, శ్రావణి సస్పెండ్ అయ్యారు. ఆయా పంచాయతీల్లో ప్రభుత్వం చేపట్టిన ఆస్తుల నమోదు సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గడువులోగా సర్వే పూర్తి చేయక పోవడంతో కలెక్టర్ సీరియస్గా స్పందించారు. ఈక్రమంలో ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని పంచాయతీ ఆధికారి రమేష్ శుక్రవారం ధృవీకరించారు.